Chityala Suhasini Reddy: కళలను కాపాడాల్సిన బాధ్యత అందరిది…

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

కళలను కాపాడాల్సిన బాధ్యత అందరిది…
+ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిట్యాల సుహాసిని రెడ్డి

అంతరించిపోతున్న సాంస్కృతి, సాంప్రదాయాలతో పాటు ప్రాచీన కళలను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ఆదిలాబాద్‌ పట్టణ కేంద్రంలోని రామచంద్ర గోపాల కృష్ణ మఠం ఆవరణలో ఏర్పాటు చేసిన ‘మం«థనం ఒక సంకల్పం’ కళా సాంస్కృతిక వేధిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జడకొప్పులాట’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన గావించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జడకొప్పులాట వంటి అద్భుతమైన కళను ప్రత్యక్షంగా వీక్షించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కళలను రానున్న తరలవారికి అందించాలని నిర్వహకులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *