CI D Sainath: 280 క్వింటాళ్ల రాయితీ బియ్యం స్వాధీనం : జైనథ్ సీఐ డి సాయినాథ్

సిరాన్యూస్, జైన‌థ్‌
280 క్వింటాళ్ల రాయితీ బియ్యం స్వాధీనం : జైనథ్ సీఐ డి సాయినాథ్
* ఆసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం
* మట్కా, గుట్కా, జూదం గంజాయి లాంటి వాటిని ఉపేక్షించేది లేదు

నిర్మ‌ల్ జిల్లా నుండి మహారాష్ట్ర కు రాయితీ బియ్యన్ని తరలిస్తున్నారని ఆదిలాబాద్ డీఎస్పి ఎల్ జీవన్ రెడ్డికి వ‌చ్చిన‌ విశ్వసనీయ సమాచారం మేరకు జైనథ్ సీఐ డి. సాయినాథ్‌, జైనథ్ ఎస్సై తనిఖీలు నిర్వహించ‌గా 280 క్వింటాళ్ల రాయితీ బియ్యం ప‌ట్టుబ‌డ్డింది. జైనథ్ సీఐ డి సాయినాథ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… రాయితీ బియ్యం నిర్మల్ నుండి మహారాష్ట్రలోని గొండియా జిల్లాకు వాహ‌నంలో తరలిస్తున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండ‌లంలోని భోర‌జ్ చెక్ పోస్టు వ‌ద్ద వాహ‌నాన్ని త‌నిఖీ చేయ‌గా 280 క్వింటాళ్ల రాయితీ బియ్యం ప‌ట్టుబ‌డ్డాయి. జైనథ్ పోలీస్ స్టేషన్‌లో విచారణ చేపట్టగా నిర్మల్ లోని అన్నపూర్ణ రైస్ మిల్ ట్రేడర్స్ వద్ద నుండి మహారాష్ట్రలోని గొండియా జిల్లా విలాస్ రైస్ మిల్లుకు తరలిస్తున్నారని డ్రైవర్ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసిన‌ట్లు జైనథ్ డి సాయినాథ్ తెలిపారు. తదుపరి ఈ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారికి అందజేసిన‌ట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలన రూపుమాపడానికి తనదైన శైలిలో విధులను నిర్వర్తిస్తున్న ఆదిలాబాద్ డీఎస్పిని జైనథ్ సీ, ఎస్ఐలను జిల్లా ఎస్పీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *