CI P. Ramesh: గంజాయితో పట్టుబడిన యువకుడి అరెస్ట్ : సీఐ పి.ర‌మేశ్‌

సిరాన్యూస్‌, భీమదేవరపల్లి
గంజాయితో పట్టుబడిన యువకుడి అరెస్ట్ : సీఐ పి.ర‌మేశ్‌
* 250 గ్రాముల గంజాయి స్వాధీనం

గంజాయి అమ్ముతున్న వ్యక్తిని ముల్కనూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు సుమారు ఆరు వేల రెండు వందల యాబై రూపాయల విలువగల 250 గ్రాముల గంజాయితో పాటు, ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ పి. ర‌మేశ్ ముల్క‌నూరు పోలీసు స్టేష‌న్‌లో వివ‌రాలు వెల్ల‌డించారు. హ‌నుమ‌కొండ జిల్లాకు చెందిన మాట్ల దిలీప్ 2022 నుంచి గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా గంజాయి తాగడం అలవాటు చేసుకున్నాడు. నాగ‌పూర్ నుంచి గంజాయి తెచ్చుకొని తాగుతున్నాడు. ఈ క్ర‌మంలో తెచ్చిన గంజాయిలో కొంత అమ్ముతున్నాడు. ఈసంద‌ర్బంగా అత‌డికి డ‌బ్బులు అవ‌స‌రం ఉన్నప్పుడు తాను తెచ్చిన గంజాయిలో కొంత అమ్ముతున్నాడు. నాగ్‌పూర్ నుంచి తెచ్చిన గంజాయిని అమ్మేందుకు బీమ‌దేవ‌ప‌ల్లి మండ‌ల కొత్త‌ప‌ల్లి శివారులో విక్ర‌యిస్తండ‌గా పోలీసుల‌ను చూసి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించారు. అత‌డిని ప‌ట్టుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు. అనంత‌రం కోర్టులో హాజ‌రుప‌ర్చిన‌ట్లు తెలిపారు.గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ముల్కనూర్ సబ్ ఇన్స్ స్పెక్టర్ సాయి బాబు , హెడ్ కానిస్టేబుళ్ళు నాగేశ్వర రావ్ , కానిస్టేబుల్ తిరుపతి, మోహన్ బాబు, వెంకటేశ్వర్లు, శోభన్ బాబు, శివరాజు, రాజు, సదానందం సి ఐ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *