సిరాన్యూస్,ఖానాపూర్
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: సీఐ సైదారావు
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సీఐ సైదారావు అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ జూనియర్ కాలేజ్లో విద్యార్థులకు మత్తు పదార్థాలు, గంజాయి, రోడ్డు సేఫ్టీ, సైబర్ క్రైమ్ అంశాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, పిల్లలు చెడు వ్యసనాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై లింబాద్రి , ప్రిన్సిపల్ ,లెక్చరర్లు , కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.