సిరాన్యూస్,చిగురుమామిడి
గంజాయి రహిత సమాజం కోసం కృషి: సీఐ స్వామి
గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తిమ్మాపూర్ సీఐ స్వామిఅన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మూల్కనూరు గ్రామంలో గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత కోసం అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి తో యువత చెడు మార్గంలో వెళ్లి జీవితాలను బలి చేసుకుంటున్నారని తెలిపారు.గంజాయి వాడినట్లు సమాచారం తెలిస్తే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని కోరారు. సైబర్ నేరాలకు గురై అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటున్నారని తెలిపారు.సైబర్ నేరానికి గురైనట్లుగా అనుమానం వస్తే 1930, డయల్ 100 కు ఫోన్ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ బండి రాజేష్,పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.