సిరాన్యూస్, ఆదిలాబాద్
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం : సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు.
కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌక్ లో నిరసన చేపట్టి ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రి మాట్లాడారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను ప్రతీకటిద్దామన్నారు.కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ఆవిలంబిస్తున్నదని కార్పొరేట్ల ప్రయోజనం కోసం దేశ స్వాతంత్రాన్ని స్వావలంబనను తాకట్టు పెడుతున్నదన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం నిత్యం స్వదేశీ జపం చేస్తూ విదేశీ సంస్థలకు భారతదేశాన్ని తాకట్టు పెడుతుందని, జాతీయ వనరులను సంపదను లూటి చేస్తుందన్నారు. ఎందరో త్యాగదనులు పోరాట యోధుల ప్రాణ త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్రాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాలని ఐక్య పోరాటాలకు కార్మికులు కర్షకులు సన్నద్ధం కావాలని అన్నారు.స్వాతంత్రోద్యమ అమరుల స్ఫూర్తితో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం అవ్వాలని దేశ ప్రజారంగ సంస్థలను కార్మిక హక్కులను కాపాడుకోవాలని పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న ఉపాధ్యక్షులు అగ్గిమల స్వామి నాయకులు పండుగ పొచ్చన్న, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగాల నర్సింగ్, ఏఐటీయుసి జిల్లా కార్యదర్శి చిర్రే దేవేందర్, ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి చిలక దేవిదాస్ ఏఐటీయూసీ నాయకులు రాజు,ఆశన్న, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి వెంకట్ నారాయణ,జిల్లా నాయకులు మాదవి గణేష్, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్, జిల్లా సహాయ కార్యదర్శి ఉమ్రే నితిన్, ఏఐపీకేఎస్ జిల్లా అధ్యక్షులు కొడప సురేష్ జిల్లా నాయకులు బుచ్చి రామ్, తదితరులు పాల్గొన్నారు.