సిరాన్యూస్ ,బోథ్
పాఠశాల తనిఖీ చేసిన జిల్లా సివిల్ సప్లై అధికారి కిరణ్కుమార్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలను ప్రత్యేక అధికారి, జిల్లా సివిల్ సప్లై అధికారి కిరణ్ కుమార్ తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో సాగుతున్న చదువులతో పాటు పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు ఉన్న విషయ పరిజ్ఞానం పరిశీలించారు. అధికారి అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు చెప్పిన జవాబులతో సంతృప్తి వ్యక్తపరిచారు. అనంతరం మధ్యాహ్న భోజన ఏజెన్సీల వారిని పిలిచి భోజన మెనూ అడిగి తెలుసుకున్నారు . అంతేగాక వంట విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఇక పాఠశాలలోని రికార్డులను పరిశీలించి ప్రభుత్వపరంగా అందుతున్న బియ్యం స్టాక్ నిల్వలను పరిశీలించారు. పాఠశాల నిర్మాణ పట్ల ప్రధానోపాధ్యాయులు కుమ్మరి పోసెట్టిని ఉపాధ్యాయులను అభినందించారు. ఆయన వెంట గ్రామ పంచాయతీ ఈవో అంజయ్య ఉన్నారు.