సిరా న్యూస్,చిత్తూరు;
చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తెలిపారు. చిత్తూరు నగరంలో ప్రసిద్ధి చెందిన గంగ జాతరను ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. పట్టణం నడిబొడ్డులోని బజారు వీధిలో కొలువు తీరనున్న అమ్మవారి విగ్రహ ఏర్పాట్లను ఆదివారం మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పరిశీలించారు. అమ్మవారికి అలంకరించే ఆభరణాలను ప్రదర్శించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ సమన్వయంతో జాతర నిర్వాహక బృందం ఏర్పాట్లను చేపడుతోంది.
===============