ఉమ్మడి మ్యానిఫెస్టో పై ఇంకా రాని క్లారిటీ

సిరా న్యూస్,విశాఖపట్టణం;

ఆంధ్రప్రదేశ్‎లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌నేదితెలుగుదేశం పార్టీ ఆలోచ‌న‌. దీనికోసం అన్ని ర‌కాలుగా క‌స‌ర‌త్తుచేస్తున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే జ‌న‌సేన పార్టీతోపొత్తు కుదిరిన‌ప్పటికీ అభ్యర్ధుల విష‌యంలో మాత్రం ఇంకా ఓ నిర్ణయానికిరాలేక‌పోతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎన్నిక‌ల కోసం దూకుడు పెంచారు.ఓ వైపు రా.. క‌ద‌లిరా స‌భ‌ల‌తో జిల్లాల ప‌ర్యట‌న‌ల‌కు వెళ్తూనే మిగిలినస‌మ‌యాల్లో అభ్యర్ధుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. జిల్లాల వారీగాఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక‌కు సంబంధించి స‌ర్వేలు, నివేదిక‌లు, స్థానికప‌రిస్థితుల ఆధారంగా చంద్రబాబు ఓ నిర్ణయానికి వ‌స్తున్నారు. వ‌చ్చేఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో ఇబ్బంది లేని స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక వేగంగాచేస్తున్నారు.ఇప్పటికే చాలామంది అభ్యర్ధులను అధికారికంగాప్రక‌టించ‌క‌పోయిన‌ప్పటికీ ఆయా అభ్యర్దుల‌కు మాత్రం క్లారిటీఇచ్చేస్తున్నారు.

నియోజ‌క‌వ‌ర్గాల్లోకి వెళ్లి ఎన్నిక‌ల ప‌నులు, ప్రచారంచేసుకుంటూ ప్రజల్లోనే ఉండాల‌ని సూచిస్తున్నారు. మ‌రోవైపు ఒకే స్థానంలోఒక‌టి కంటే ఎక్కువ‌మంది పోటీలో ఉంటే అలాంటి వారిని పిలిచి స‌ర్ధిచెప్పేప్రయ‌త్నం చేస్తున్నారు. ఇలాంటి స్థానాల్లో ఐవీఆర్ఎస్ స‌ర్వే ద్వారాఎవరివైపు ఎక్కువ‌మంది ప్రజ‌లు మొగ్గు చూపుతారో అటువంటి వారిని ఎంపికచేస్తున్నారు. ఇక కొన్నిచోట్ల ఇంచార్జిలు ఉన్నప్పటికీ ఆశావ‌హులు కూడాఎక్కువ‌గానే ఉన్నారు. పొత్తుల‌తో ఎన్నిక‌ల‌కు వెళ్తున్నామ‌ని..కొంత‌మందికి సీటు రాలేద‌ని నిరుత్సాహ‌ప‌డ‌వ‌ద్దని వారికి న‌చ్చజెప్పేప్రయ‌త్నం చేస్తున్నారు.అధికారంలోకి వ‌స్తే పార్టీకోసం క‌ష్టప‌డిన వారికిత‌ప్పకుండా న్యాయం చేస్తామ‌ని ముందుగానే చెబుతున్నారు. ఇలాఎప్పటిక‌ప్పుడు నియోజ‌కవ‌ర్గాల్లో ఉన్న అంత‌ర్గత విభేదాలనుప‌రిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే జ‌న‌వ‌రిలోనే మొద‌టివిడ‌త అభ్యర్ధుల జాబితా ప్రక‌టిస్తార‌ని అనుకున్నప్పటికీ వాయిదాల ప‌ర్వంకొన‌సాగుతూనే ఉంది. ఈ ప్రక‌ట‌న మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలుక‌నిపిస్తున్నాయి.

పొత్తుల‌పై పూర్తి స్పష్టత వ‌స్తే గానీ అభ్యర్ధులప్రక‌ట‌న ఉండే అవ‌కాశం క‌న‌బ‌డ‌టం లేదు.తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులప్రక‌ట‌న ఆల‌స్యం అవ‌డానికి కార‌ణం పొత్తుల‌పై స్పష్టత రాక‌పోవ‌డ‌మేఅంటున్నారు ఆ పార్టీ నేత‌లు. ఇప్పటికే తెలుగుదేశం-జ‌న‌సేన మ‌ధ్య సీట్లవిష‌యంపై క్లారిటీ వ‌చ్చిన‌ట్లు తెలిసింది. అయితే బీజేపీతో పొత్తు విష‌యంఎటూ తేల‌క‌పోవ‌డంతో టీడీపీ-జ‌న‌సేన ఉమ్మడి అభ్యర్ధుల ప్రక‌ట‌న కూడాఆల‌స్యం అవుతుంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ స‌మావేశాల త‌ర్వాతపొత్తులపై పూర్తి స్పష్టత వ‌స్తుంద‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లుచెబుతున్నారు. ఈనెల 20 వ తేదీ త‌ర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్తార‌ని కూడాపార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లిఅమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఢిల్లీవెళ్తారని ప్రచారం జ‌రిగింది. కానీ ఇంత‌వ‌ర‌కూ ప‌వ‌న్ ఢిల్లీవెళ్లలేదు.అస‌లు చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ఏం జ‌రిగింద‌నే దానిపై కూడాఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. వ‌చ్చే వారంలో చంద్రబాబు, ప‌వ‌న్ కూడా ఢిల్లీవెళ్తార‌ని.. అప్పుడే టీడీపీ ఎన్డీయేలో చేరిక‌పై స్పష్టతవ‌స్తుందంటున్నారు.

అయితే బీజేపీతో క‌లిసి వెళ్లడం ఖ‌రార‌యిపోయింద‌ని..ఇక మిగిలింద‌ల్లా సీట్ల స‌ర్ధుబాటు మాత్రమేన‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతుంది.ఒక‌వేళ టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ క‌లిసి పోటీ చేస్తే ఎవ‌రు ఎన్ని సీట్లలోబ‌రిలో ఉంటారనేది స్పష్టత వ‌స్తుంది. దానిక‌నుగుణంగా ఉమ్మడి అభ్యర్దులజాబితా ప్రక‌టించ‌వ‌చ్చని తెలుగుదేశం పార్టీ నేత‌ల నుంచి అందుతున్నస‌మాచారం. పొత్తులతో ఈసారి టీడీపీకి సీట్లస‌ర్ధుబాటు పెద్ద స‌మ‌స్యగానేమారింది. దీంతో అభ్యర్ధుల విష‌యంలో చంద్రబాబు ఆచితూచిఅడుగులేస్తున్నారు.మ‌రోవైపు ఉమ్మడి మేనిఫెస్టో విడుద‌ల కూడా ఆల‌స్యంఅవుతుంది. ఉమ్మడి అభ్యర్ధుల ప్రక‌ట‌న‌తో పాటు ఉమ్మడి మేనిఫెస్టో విడుద‌లకూడా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇప్పటివ‌ర‌కూ టీడీపీ-జ‌న‌సేన క‌లిసిమేనిఫెస్టోను రూపొందించాయి. బీజేపీతో పొత్తు కుదిరితే ఆ పార్టీ నుంచికూడా మేనిఫెస్టో పై చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉంటుంది. అందుకే అభ్యర్ధులప్రక‌ట‌న‌తో పాటు మేనిఫెస్టో విడుద‌ల కూడా ఆల‌స్యం అవుతుంది. ఈ వ‌చ్చేవారంలో అన్ని అంశాల‌పై పూర్తి క్లారిటీ వ‌స్తుంద‌ని తెలుగుదేశం పార్టీనేత‌లు చెబుతున్నారు. ఈ నెలాఖ‌రులోగా అభ్యర్ధుల జాబితాతో పాటు ఉమ్మడిమేనిఫెస్టో కూడా విడుద‌ల‌య్యే అవకాశం ఉందంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *