పలువురికి గాయాలు
సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల్ గణేష్ పల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కుల సంఘానికి సంబంధించిన చీటీ విషయంలో ఇరువర్గాల మధ్యన ఘర్షణ ఓకే కుటుంబానికి చెందిన పదిమందికి గాయాలు అయ్యాయి. బండరాళ్లు, కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. గాయాలపాలైన వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు.