మాదల గ్రామంలో ఘర్షణ

సిరా న్యూస్,పల్నాడు;
పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో అర్ధరాత్రి టిడిపి,వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కరెంటు తీసేసి రాళ్లతో పెట్రోల్ బాంబులతో విధ్వంసం సృష్టించారు గ్రామస్తులు. పోలింగ్ ముగిసిన కూడా గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొంది. పెద్ద పెద్ద బండరాళ్లతో సీసాలతో దాడులకు ఇరువర్గాలు తెగబడ్డారు. దాంతో ప్రజలు భయాందోళనకు గురైయారు. పోలీసులు రంగ ప్రవేశం చేసినా కూడా పోలీస్ వాహనాల పై రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. గ్రామంలో ఎప్పుడు ఎన్నడు లేని విధంగా రెండు వర్గాలు దాడులకు తెగబడటంతో ఒక్కసారిగా గ్రామ రూపురేఖలు మారిపోయాయి. అర్ధరాత్రి గ్రామంలో ఏం జరుగుతుందో ఏమోనని ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *