సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా పార్సింగీ లో విషాదం నెలకొంది. అల్కాపూరీ కాలనీ మదర్సా లో చిన్నారుల మద్య ఘర్షణ జరిగింది. మహ్మద్ రకీమ్ పై పిల్లల దాడి జరిగింది. దాడి లో తీవ్రంగా గాయపడిని బాలుడు అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మదర్సా లో బీహార్ కు చెందిన 12 మంది విద్యార్ధులు వున్నారు. రాత్రి చిన్న విషయానికి చిన్నారుల మద్య వివాదం జరిగింది. నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.