సిరా న్యూస్,చిత్తూరు;
శాంతిపురం మండల పరిధిలోని నంజంపేటలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తమ కుటుంబంపై నంజంపేట గ్రామానికి చెందిన సుమారు 15 మంది దాడి చేశారని వీసికే ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్ప ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తన తమ్ముడు కృష్ణమూర్తి బెంగళూరు నుండి తమ గ్రామమైన గట్టూరుకు వెళ్తుండగా కారుపై రాళ్ళతో దాడి చేసారన్నారు.
రాళ్లతో కారు పై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించినందుకు కర్రలు, రాళ్లతో దాడి చేశారని తెలిపారు.
గతంలో రెండుసార్లు దాడికి పాల్పడ్డారని తెలిపారు. నంజంపేట గ్రామానికి చెందిన ఉమాశంకర్, బాలాజీ, నాగభూషణం తదితరులు నిన్న రాత్రి రాళ్లు, కర్రలతో దాడి చేశారనీ పేర్కొన్నారు. ఈ ఘర్షణలో తమ
కుటుంబసభ్యులకు తీవ్రగాయాలు అయిందన్నారు. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని కుప్పం పి.ఈ.ఏస్ ఆసుపత్రికి తరలించారు. ఘర్షణకు గల కారణాలు రాళ్లబుదుగూరు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.