సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
సీఎం సభ కు తరలి వెళ్ళిన ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు
అదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జన జాతర సభ కు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు. అనంతరం ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్నుఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఖానాపూర్ మండల అధ్యక్షుడు దోనికేని దయనంద్, మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, వైస్ చైర్మన్ కావాలి సంతోష్, మైనార్టీ నియోజకవర్గ అబ్జర్వర్ షబ్బిర్ పాషా, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్,కౌన్సిలర్ ఆమనుల్లా ఖాన్, మాజీ సర్పంచ్ నెరేళ్ల సత్యనారాయణ, నాయకులు మడిగేలా గంగాధర్, మిర్జా బేగ్,రాజేశ్వర్, మదిరే సత్యనారాయణ, వెంకటప్ప య్య, అశోక్, శారు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.