మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్

సిరా న్యూస్,హైదరాబాద్;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ అక్కడి నుంచి హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికిచేరుకున్నారు. కేసీఆర్ నివాసం వద్ద జగన్ కు కేటీఆర్ ఆహ్వానం పలికి, లోపలకు తీసుకెళ్లారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. తరువాత అయన కేసీఆర్ తో భేటీ అయ్యారు.ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య రాజకీయ చర్చలు కుడా జరిగినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *