అప్రమత్తంగా వుండాలి

ప్రాణనష్టం జరగడానికి వీలు లేదు
అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి
సీఎం జగన్ మోహన్ రెడ్డి

సిరా న్యూస్,అమరావతి;
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవరం తుఫాను ప్రభావిత 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
అధికారులు తుపాను నేపధ్యంలో చేపడుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటివరకు సుమారు 1 లక్ష టన్నుల ధాన్యాం సేకరణ. మరో 6.50 లక్షల  టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెపారు.
సీఎం మాట్లాడుతూ తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. హుద్ హుద్ లాంటి పెద్ద తుఫానులను కూడా మన రాష్ట్రం చూసింది. అటువంటి తుపాన్లును సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో మంచి అనుభవం మన అధికారులకు ఉంది.  210 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా..ఈ తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉంటూ, యంత్రాంగం సీరియస్గా ఉండాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *