సిరాన్యూస్, సైదాపూర్:
ఎక్లాస్ పూర్లో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
సైదాపూర్ మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అంబాల ప్రేమ్ కుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆసరి రఘు యాదవ్ చేతుల మీదుగా మంగళవారం గాజుల సదానందం కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా వేలాది చెక్కులను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి దస్తగిరి, మేకల క్రాంతి కుమార్, చల్లూరి రవీందర్, గాజర్ల రమేష్, ఇల్లందుల సంపత్, పడాల తిరుపతి, ఆసరి రాజు తదితరులు పాల్గొన్నారు.