శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

 సిరా న్యూస్,తిరుమల;
తిరుమల ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం బుధవారం దర్శించుకున్నారు.అయన కుటుంబంతో మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనతో పాటు భార్య, కుమార్తె, అల్లుడు మనవడు ఉన్నారు. మనవడి పుట్టు వెంట్రుకల కార్యక్రమం కోసం ఆయన తిరుమలకు వచ్చారు. బుధవారం ఉదయం పుట్టు వెంట్రుకల కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ముడుపులు చెల్లించడానికి ఆలయంలోకి కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు .ఆలయంలోకి వైకుంఠము క్యూలైన్ ద్వారా ఆయన చేరుకున్నారు.
========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *