ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటువేసేందుకు కుటుంబసభ్యులతో కొడంగల్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. జిల్లా పరిషత్‌ స్కూలులోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన అనంతరం స్థానికులతో మాట్లాడారు. ఈ సంరద్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ స్థానంలో తాము గెలవబోతున్నామన్నారు. సంక్షేమ పథకాలకు, ప్రభుత్వానికి ఈ ఎన్నికలు రెఫరెండం అని తెలిపారు.అనంతరం గ్రామస్థులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *