సిరా న్యూస్,సుక్మా;
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకలగూడెం గ్రామంలో మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో గాయపడిన పోలీసులను ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైద్యులను ఆదేశించారు. ఈ సమయంలో, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ, అటవీ శాఖ మంత్రి కేదార్ కశ్యప్ కూడా ఉన్నారు.