అన్ని ఏర్పాట్లు సంసిద్దం చేయాలి
జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు
ఏ.ఎస్.ఎల్. నిర్వహణలో భాగంగా.. కడప విమానాశ్రయం నుండి గోపవరం సెంచరీ ఫ్లై పరిశ్రమలో సీఎం పర్యటించే ప్రాంతాల పరిశీలన
సిరా న్యూస్,బద్వేలు;
ఈ నెల 23, 24, 25వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించి ఎన్ని ఏర్పాట్లను సంసిద్దం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అధికారులను ఆదేశించారు.బుధవారం బద్వేలు సమీపంలోని గోపవరం వద్ద సెంచరీ ఫ్లై ఇండస్ట్రీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్, ముఖ్యమంత్రి ప్రారంభించనున్న.. ఎం.బి.ఎఫ్., హెచ్.డి.ఎఫ్ ప్లాంట్ లను జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు.. జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, ఎమ్మెల్యే డా.డి.సుధా, జేసీ గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీవో వెంకట రమణ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సంబందిత అధికారులు, సెంచరీ ఫ్లై పరిశ్రమ యాజమాన్య సిబ్బంది పలు సూచనలు జారీ చేశారు. అనంతరం ఏఎస్ఎల్ నిర్వహణలో భాగంగా సింహాద్రిపురం బయలుదేరి వెళ్లారు.