సిరా న్యూస్,విశాఖపట్నం;
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. విజ యం దిశగా కూట మి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా కూటమి విజయంతో అభ్యర్థులు, నాయకు లు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.దీంట్లో బాగంగా విశాఖ టిడిపి కార్యాలయంలో టిడిపి శ్రేణులు సంబరాల్లో మునిగితేలారు. అత్యదిక మెజారిటీ దిశగా టిడిపి దూసుకెళ్లడంపై హర్షం వ్యక్తం చేస్తు న్నారు.ఎన్నికల ఫలితాలు టీడీపీకి ఊహకందని విధంగా రావడంతో వారం తా సంబరాల్లో మునిగిపో యారు. అధికారం దిశగా ప్రభంజనం సృష్టిస్తుండటంతో శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. జై టీడీపీ. జైజై చంద్రన్న. సీఎం చంద్రబాబు అంటూ పార్టీ శ్రేణులు నినాలు చేశారు. డ్యాన్సులతో ఉత్సాహంగా గడిపారు.