సిరా న్యూస్,అనకాపల్లి;
వల్లూరు ఎరుకవానిపాలెం రాజుపాలెం గ్రామాల నాయకులతో తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి అభ్యర్థి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ కాఫీ విత్ కేడర్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు బొడ్డేడ జోగి నాయుడు పలువురు వక్తలు మాట్లాడుతూ కొణతాల రామకృష్ణ గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ రామకృష్ణ వంటి నాయకులు మనకిప్పుడు చాలా అవసరమని కొనియాడారు. కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి నేత అనకాపల్లి బిజేపి పార్టీ ఎంపీ అభ్యర్థి సీఎం.రమేష్ తనయుడు రిత్విక్ మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పథకాల పేరుతో ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టారని అన్నొచ్చాడు బటన్ నొక్కాడు అని చెప్పుకుంటున్న జగన్ కి రేపు జరగబోయే ఎలక్షన్లలో కూటమి అభ్యర్థుల గుర్తులపై బటన్ నొక్కి బుద్ధి చెప్పాలని అన్నారు. మీ ప్రాంతంలో పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చెందాల్సి ఉన్నా ఒక్క పరిశ్రమ కూడా లేకపోవడం దురదృష్టకరమని ఈ ఎలక్షన్లలో కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో టిడిపి జనసేన కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడగానే మీ ప్రాంతానికి పరిశ్రమలు రావాలంటే అది ఒక్క బిజెపి ప్రభుత్వం వస్తేనే సాధ్యపడుతుందని కనుక మీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కమలం గుర్తుపై మరియు ఎమ్మెల్యే అభ్యర్థి కొంతల రామకృష్ణ గాజు గ్లాస్ గుర్తుపై బటన్ నొక్కి గెలిపించాలని కోరారు.ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ నేను రాజకీయాలలో సీనియర్ని , పెద్దవాడిని అయినా సరే ఇప్పుడున్న కూటమిలో భాగంగా నేను చాలా చిన్నవాడిని నాకన్నా పెద్దవారు అన్నదమ్ములు లాంటి తెలుగుదేశం బిజెపి నాయకులు ఉన్నారు వారి చేతులు పట్టుకొని నేను నడుస్తానని జనసేన పేరుతో నేను గెలిచిన సరే తెలుగుదేశానికే ముఖ్య ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఒక్క ఛాన్స్ అని అడిగి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు అలాగే మన ప్రాంతంలో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉన్నప్పటికీ వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ పారిశ్రామిక మంత్రిగా ఉన్నప్పటికీ ఒక పరిశ్రమను కూడా తీసుకురాలేని పరిస్థితి ఏర్పడిందని అలాగే వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడేటటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేశారని ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రం మొత్తం నిర్వీర్యం చేసి దోచుకుపోయారని కనీసం రాజధాని కూడా నిర్మించలేని రాష్ట్రంగా దేశంలో మన రాష్ట్ర ఒకటే ఉన్నదని గడచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి చేసింది అంటే పూర్తిగా ప్రభుత్వ భూములు అన్ని వాళ్లు దోచుకోవడంలో అభివృద్ధి చెందిందని చెప్పుకోవాలి అని అన్నారు.ఈ సమస్యలన్నీ అభివృద్ధి దిశలో ముందుకు వెళ్లాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం పడుతుందని కనుక చంద్రబాబు నాయుడు నాయకత్వం ఇప్పుడు మన రాష్ట్రానికి చాలా అవసరమని అన్నారు.కనుక మన రాష్ట్రం మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మనకు మంచి రోజులు రావాలంటే తెలుగుదేశం జనసేన బిజెపి కూటమిలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి గాజు గ్లాస్ గుర్తుపై అలాగే ఎంపీ అభ్యర్థి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఈ రెండు గుర్తులను ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కి చేరే విధంగా ముందుకు తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీష్ , డా,నారాయణరావు, బొడ్డేడ జోగినాయుడు , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.