సిరా న్యూస్, నరసాపురం;
ఏటిగట్టు పనులు చేస్తుండగానే గట్టు కుప్ప కూలడం తో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో 2022 నవంబరు లో గోదావరి కి వచ్చిన వరదలు కు పొన్నపల్లి వద్ద ఏటీగట్టు కోతకు గురైనది. ఆ సమయంలో రూ.56లక్షలు తో తాత్కాలికంగా పనులు చేసి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు.అనంతరం శాశ్వత పనులు చేపట్టేందుకు రూ.26.3 కోట్లు తో పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పనులు జరుగుతున్న గట్టు కుప్ప కూలింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాపోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతాన్ని జనసేన నియోజకవర్గ ఇన్చార్జీ బొమ్మిడి నాయకర్, టీడీపీ నాయకులు కొవ్వలి రామ మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తదితరులు పరిశీలించారు.