సిరా న్యూస్,శ్రీకాకుళం;
ప్రజల్లో సూర్య నమస్కారాలు, యోగాసనాల పై చైతన్యం కల్పించేందుకు సోమవారం శ్రీకాకుళం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో మహిళలు సూర్య నమస్కారాలు యోగాసనాలు చేశారు.కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మానసిక ఒత్తిడిని తొలగించడానికి సూర్య నమస్కారాలు, ఆసనాలు దోహదపడతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు.సూర్య నమస్కారాలు చేస్తే రోగాలు దరిచేరవని యోగా శిక్షకులు అభిప్రాయ పడ్డారు.మహిళలు యోగాసనాలు చేయడంతో ఎన్నో శారీరక సమస్యలు దూరమవుతాయని అన్నారు..