సిరాన్యూస్:చిగురుమామిడి
తల్లులు పౌష్టికాహారం తీసుకోవాలి : కలెక్టర్ పమేలా సత్పతి
తల్లులు పౌష్టికాహారం తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని చిన్న మూల్కనూరులో నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భవతులు పౌష్టికాహారం తీసుకోవడం వలన పుట్టే పిల్లలు ఆరోగ్యవంతంగా పుడతారని పేర్కొన్నారు. పుట్టిన పిల్లలకు తల్లులు సంవత్సరం కాలం తల్లిపాలు ఇవ్వడం వలన పిల్లలు ఆరోగ్యవంతంగా జీవిస్తారన్నారు. పౌష్టికాహారం పైన అవగాహన లేక మహిళల్లో రక్తహీనత ఏర్పడి శిశు మరణాలు సంభవిస్తున్నాయన్నారు. వీటిని నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తుందన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లిపాల ద్వారా పిల్లలకు అలాగే తల్లులకు కూడా సరైన పోషకాలు అంది తల్లి, బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. ప్రభుత్వం అందించే పౌష్టికాహారం పైన నిర్లక్ష్యం చేయకుండా సద్విగం చేసుకోవాలన్నారు . ప్రభుత్వ ఆసుపత్రిలో సర్కారు ఆధునిక సదుపాయాలు కల్పిస్తుందని, ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని ఆమె సూచించారు.జిల్లా వైద్యాధికారిని సుజాత మాట్లాడుతూ… గర్భిణీలు,బాలింతలు మహిళలందరూ ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని,సీజనల్ గా వచ్చే వ్యాధుల పైన జాగ్రత్త వహించాలని వివరించారు.జిల్లా మహిళా అభివృద్ధి,శిశు సంక్షేమ శాఖలో పనిచేసే అన్ని శాఖలవారు వారి యొక్క ఆవశ్యకతను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దారు రమేష్, ఎంపీడీవో ఖాజా మొయినుద్దీన్, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, సీడీపీవో శ్రీమతి,ఎంపీవో రాజశేఖర్ రెడ్డి,పల్లె దావఖన డాక్టర్ మాధురి,డిసిపిఓ శాంత, సంపత్,శ్రీలత,సఖి రేణుకా, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి,పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ నాగరాజు, రోమిల,ప్రణీత అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎంలు,ఆయాలు ఆశాలు, మహిళా గ్రూప్ కార్యకర్తలు గర్భిణీలు,బాలింతలు తదితరులు పాల్గొన్నారు.