సిరాన్యూస్, ఇచ్చోడ
విద్యార్థులకు అప్రెంటిషిప్ పత్రాల అందజేత : కళాశాల ప్రిన్సిపల్ మధుకర్
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర ఒకేషనల్ కళాశాలలో గత సంవత్సరం ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్ డబ్ల్యూ ఫిమేల్), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విద్యార్థులకు రిమ్స్ లో ట్రైనింగ్ కోసం శనివారం అప్రెంటిషిప్ పత్రలను అందించారు. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వర ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ మధుకర్, ఆధ్యాపక బృందం పాల్గొన్నారు.