సిరా న్యూస్,శ్రీకాళహస్తి;
శ్రీ హజరత్ జుంలేషాపీర్ దర్గా కమిటీ సభ్యులు బుధవారం సినీ నటుడు సుమన్ ను రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం లో కలిశారు. సెప్టెంబర్ లో జరిగే దర్గా ఉరుసు ఉత్సవాలకు రావాలని ఉరుసు కమిటీ సభ్యులు ఆహ్వానించారు. అదేవిదంగా సుమన్ జన్మదిన సందర్భంగా శ్రీ కాళహస్తిశ్వర స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సమావేశంలో దర్గా కమిటీ ప్రెసిడెంట్ ఓరుగంటి నాగేశ్వరరావు ఆర్గనైజర్స్ న్యాయవాది గుమ్మలా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు