Commencement of the Adhyayanotsavala at Shri Govindarajaswamy temple..శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభం

సిరా న్యూస్,తిరుపతి;

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధ‌వారం అధ్యయనోత్సవాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి.ప్ర‌తి ఏడాదీ ఆలయంలో అధ్య‌య‌నోత్స‌వాల సంద‌ర్భంగా దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉద‌యం ఆల‌యంలో సేవాకాలం నిర్వ‌హించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా జ‌న‌వ‌రి 20న చిన్నశాత్తుమొర, జ‌న‌వ‌రి 26న ప్రణయ కలహోత్సవం, జ‌న‌వ‌రి 30న పెద్దశాత్తుమొర నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు నారాయణ, మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రాధాకృష్ణ, ధనుంజయ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *