అబాకస్ పోటీల్లోభాష్యం విద్యార్థుల విజయకేతనం

సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
పట్టణానికి చెందిన భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు కర్నూల్ లో జరిగిన అబాకస్ పోటీల్లో విజయకేతనం ఎగురవేశారు. బుధవారం స్థానిక స్కూల్లో ప్రిన్సిపాల్ మాచాని కవిత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాచాని కవిత మాట్లాడుతూ కర్నూల్లో భాష్యం జోనల్ లెవెల్ లో జరిగిన అబాకస్ పోటీల్లో మా స్కూల్ విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారని తెలిపారు. ఈ పోటీల్లో రాకేష్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్, రవి వెంకట సాయి సెకండ్ ర్యాంకు, నరేంద్ర సెకండ్ ర్యాంకు, పూర్ణిమ సెకండ్ ర్యాంక్, ఇషితా సెకండ్ ర్యాంక్, రాహుల్ థర్డ్ ర్యాంక్, సంజన థర్డ్ ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో చాంప్స్ ఇంచార్జ్ అనురాధ, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *