సిరా న్యూస్,హైదరాబాద్;
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో పిర్యాదు దాఖలయింది. మంగళవారం నాడు సోమాజిగూడ సర్కిల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ సిఎం కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పిర్యాదుచేసారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ సిఎం కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి వాక్యాలు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విందంగా ఉండడం చేత సామాన్య ప్రజలుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముటాగోపాల్, బల్క సుమన్, గెల్లు శ్రీను, ఇతర నాయకులతో కలిసి వచ్చి పిర్యాదు చేశామని అన్నారు.
ఈ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డికి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా వెసులుబాట్లు ఉన్నాయా, సామాన్యుడు అయిన సీఎం అయిన అందరి పైన చట్టం ఒకే విధంగా పనిచేస్తుంది. మాజీ సిఎం కేసీఆర్ బతికుండగానే అతని విగ్రహం గురించి మాట్లాడటం అంతా చిల్లర వ్యవహారం ఇంకొకటి లేదు. రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పోలీసులు ఎందుకు మిన్నకు ఉన్నట్టు ఉండిపోతున్నారు. రేవంత్ రెడ్డికి ఉన్న ఆ కాస్త విజ్ఞత కూడా సీఎం అయిన తర్వాత కూల్పోయాడు, సీఎం కుర్చీలో కూర్చున్న వారికి ఉండవలసిన విజ్ఞత అతడికి లేదు. శాంతి భద్రత విఘాతం కలిగించేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.