సిరా న్యూస్,హైదరాబాద్;
జీహెచ్ఎంసి కౌన్సిల్ సమయంలో కౌన్సిల్ నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బిజెపి కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసారు. ఆ అధికారులపై కౌన్సిల్లో తీర్మానం చేయాలని చెప్పినా పట్టించుకోకపోవడంతో ముఖ్యమంత్రి కి ఫిర్యాదుచేసారు. వాటర్ బోర్డు అధికారులతో పాటు జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ మమత ఇతర అధికారులు బైకాట్ చేసిన కారణంగా కౌన్సిల్ సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే. విలువైన కార్పొరేటర్ సమయంతో పాటు కౌన్సిల్ సమావేశానికి తొమ్మిది లక్షల రూపాయల ఖర్చు అయ్యింది. ఈ అంశంలో ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాం. ముఖ్యమంత్రికి ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు కలిశాను. ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని అన్నారు..