Complaint against Jump Jilani : జంపు జిలానీలపై పిర్యాదు

సమర్ధించిన ఎమ్మెల్యే అనిల్
సిరా న్యూస్,నెల్లూరు;
వైసిపి గుర్తుతో, వైసిపి బీఫామ్ తో గెలిచిన శాసనసభ్యులు..నేడు వైసిపిని వీడి టిడిపిలో చేరిన కారణంతోనే వారిపై అర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని మాజీ మంత్రి,నెల్లూరు నగర శాసనసభ్యుడు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. శాసనసభ్యులపై అర్హత వేటుకు వైసిపి అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని. తాము చేసిన ఫిర్యాదు పై మెరిట్స్, డీ మెరిట్స్ ను పరిశీలించి శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. టిడిపి శాసనసభ్యులు ఎవరు తమ పార్టీలో చేరలేదని..తమ పార్టీ కండువా కప్పుకున్న దాఖలాలు ఎక్కడా లేవని వ్యాఖ్యానిస్తూ..టిడిపికి దగ్గరైన వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి కండువాలు కప్పుకున్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. కనుకనే అధిష్టానం అలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *