సిరా న్యూస్,హైదరాబాద్;
గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో సింగర్ చిన్మయ్ పై పిర్యాదు నమోదు అయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి, యూత్ కెన్ లీడ్ సభ్యుడు ఎం. కుమార్ సాగర్ పిర్యాదు చేయడంతో సదరు పిర్యాదు నమోదయింది. ఒక యూ ట్యూబ్ ఛానల్ వేదికగా జరిగిన ఇంటర్వ్యూలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాటలకు కౌంటర్ గా సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఈ పోస్టులో భారత దేశాన్ని స్టుపిడ్ కంట్రీ( చెత్త దేశం) గా, భారత దేశంలో పుట్టడం నా కర్మా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింగర్ చిన్మయి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన హెచ్ సీయూ విద్యార్థి కుమార్ సాగర్ గచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేసారు. అన్నపూర్ణమ్మ వ్యాఖ్యల మీద అభ్యంతరం ఉంటే నేరుగా ఖండించవచ్చని, కానీ భారత దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదని కుమార్ సాగర్ వాదన. పోలీసులు ఫిర్యాదు అందినట్టు ధ్రువీకరించారు.