రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్
కమీషనరేట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీపీ
సిరా న్యూస్,పెద్దపల్లి;
రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం లోని మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల, రామగుండం నియోజకవర్గం గోదావరిఖని లోని సింగరేణి ట్రైనింగ్ సెంటర్, పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని పెద్దపల్లి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని, మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గం లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పంగిడి సోమారం లోని స్కూల్, చెన్నూర్ లోని ప్రభుత్వ స్కూల్, బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లిలోని బజారు ఏరియా లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, రామన్ పల్లి వద్ద ఉన్న అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను పోలీస్ అధికారులతో కలిసి సందర్శించి, విధి నిర్వహణలో ఉన్న అక్కడి పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణ, పోలింగ్ తరువాత పోలింగ్ పరికరాలను కౌంటింగ్ కేంద్రాలకు తరలింపు గురించి పలు ఆదేశాలు సూచనలు చేశారు. ఈసందర్బంగా సీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో పోలింగ్ అనేది ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ఎలాంటి అవాంఛనియా సంఘటనలు, గోడవలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రజలు అందరు పోలీస్ వారి సూచనలు పాటిస్తూ పోలీస్ వారికీ సహకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు అందరు వచ్చి తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకోవాలి పోలీస్ సిబ్బంది వారికి భద్రత కల్పిస్తూ, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని సీపీ తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ప్రాణహిత పరివాహక ప్రాంతంలో, ఫెర్రి పాయింట్స్ వద్ద, పోలింగ్ బూత్ ప్రాంతాలలో డ్రోన్ కెమెరా తో నిరంతర పర్యవేక్షణ, నిఘా కొనసాగుతుందని, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ పార్టీ లతో ఏరియా డామినేషన్, కూబింగ్ లు నిర్వహించడం జరుగుతుందని సీపీ తెలిపారు. సిపి వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు గోదావరిఖని ఏసీపీ రమేష్ , జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేన్, మంథని సీఐ వెంకటేశ్వర్లు, పెద్దపల్లి సీఐ కృష్ణ, చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, చెన్నూర్ టౌన్ సీఐ రవీందర్, బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ దేవయ్య, రూరల్ సీఐ ఆఫ్జాలొద్దీన్ ,ఎస్ఐ లు పాల్గొన్నారు.