సిరా న్యూస్,ఏలూరు;
పెదవేగి మండలం లక్ష్మీపురం లో మంగళవారం రాత్రి రెండు రాజకీయ పార్టీల నాయకులు బాహా బాహి కి దిగారు.ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారని సమాచారం. ఇంతకీ గొడవకు కారణం పోలవరం గట్టు మట్టి ని జిల్లా అధికారుల అనుమతి తో దెందులూరు పరిధిలో బై పాస్ ప్రక్కన దెందులూరు నియోజక వర్గ వై సి పి కార్యకర్తల సన్నాహక సమావేశ స్థలం చసదును చేయడానికి తరలిస్తున్ఆరు. ఈ సమాచారం తెలుసుకున్న కొంతమంది మట్టి తరలింపు ను అడ్డుకోవడం తో రెండు వర్గాల మధ్య వివాదం రేగి ఒకరిపై ఒకరు ఢీ అంటే ఢీ అంటూ దాడులు చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనలో కొన్ని వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయని అనుకుంటున్నారు. ఇద్దరికి దెబ్బలు గట్టిగా తగిలాయని అనుకుంటున్నారు.