సిరా న్యూస్,ఏలూరు;
రాజకీయాలు నాకేమి కొత్త కాదు అంటున్నారు అక్కడ ఉన్న సీనియర్ పొలిటీషియన్. అయితే ఆయన ఆదమరిచి ఉంటే టికెట్ ఎగరేసుకుపోవటానికి సొంత అనుచరులే సిద్ధంగా ఉన్నారు. మరోవైపు పగలు కౌగిలించుకుంటూ రాత్రులు కత్తులు నూరుకుంటున్నట్లు ఉంది విపక్షాల పరిస్థితి. మొత్తంగా అధికార పార్టీ నేతలు టికెట్ ఎవరికి వస్తుందనే టెన్షన్ ఉంటే, విపక్ష నేతలు మాత్రం నాకు రాకపోయినా ఫర్వాలేదు ఆయనకు రాకూడదు అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గందరగోళం ఎక్కడ జరుగుతుందో తెలుసా ఏలూరులో.. ఇక్కడ రాజకీయాలకే రాజకీయం నేర్పగల ఉద్దండులు ఉన్నారు.ఏలూరు నియోజకవర్గంలో రాజకీయ పోరు ఏప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అనే విధంగా సాగుతుంది. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల నానిని మార్చి కొత్త అభ్యర్థిని ఈసారి బరిలో నిలబెడతారనే ప్రచారం జరుగుతుంది. ప్రచారం ఎలా ఉన్నా సీఎం జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు ఆళ్ల నాని. ఆయన కాదని వేరే వ్యక్తికి టికెట్టు ఇవ్వటం అంటే ఆడో మిరాకిల్ గానే స్థానికులు భావిస్తున్నారు. ఏలూరులో రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా అందులో 60 వేలకు పైగా కాపు, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. గతంలో ఒకటి రెండు సార్లు మినహా ఏప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు.గత ఎన్నికల్లో ఎంతోమంది ఏలూరు టిక్కెట్టును ఆశించినప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్న ఆళ్ళ నానికే సీఎం జగన్ టికెట్ ఇచ్చి బరిలోకి దించారు. అయితే ఇటీవల పలుచోట్ల వైసీపీ అభ్యర్థుల మార్పుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు నియోజకవర్ంగాల అభ్యర్థులకు మార్పులు చేర్పులు చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే నానికి దీటుగా ప్రతిపక్షాలను ఎదుర్కొనే అంతస్థాయిలో ఉన్న అభ్యర్థులు ఉన్నారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ప్రముఖ పారిశ్రామికవేత్త మామిళ్ళపల్లి జయప్రకాష్ అలియాస్ జె పి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే జేపీ కూడా నాని అనుచరుడే కావడం విశేషం.అప్పటి నుంచి నానితో సన్నిహిత సంబంధాలు దెబ్బతిన్నాయని పలువురు భావిస్తున్నారు. ఇక మరో నేత ఏలూరు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మై బాబు. ఈయన కూడా నానికి వీర విధేయుడు. అయితే ఈసారి వైసీపీ అధిష్టానం తనను మార్చే ఆలోచనలో ఉంటే టికెట్ మై బాబుకు ఇవ్వాలని నాని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక జెపి తన శ్రీమతికి మేయర్ పదవి కోరినట్లు ప్రచారం జరుగింది. అది సాధ్యంకాకపోవటంతో నానికి జె జె పి కి మధ్య విభేదాలు వచ్చాయి.