సిరా న్యూస్,అమరావతి;
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కాసేపటికే సభలో గందరగోళం నెలకొంది. రైతు సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ వెల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల మధ్యే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బిల్లులను ప్రవేశపెట్టారు.