నాయిబ్రహ్మణ సంఘం కార్యవర్గానికి అభినందనలు

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలచే సన్మానం

సిరా న్యూస్,జగిత్యాల;
నాయి బ్రాహ్మణ సంఘం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు పెండెం మహేందర్ తో పాటు కార్యవర్గ సభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే,పట్టభద్రుల ఎమ్మెల్సీ,మున్సిపల్ చైర్ పర్సన్ లు అభినందించారు.ఈ మేరకు మంగళవారం
జగిత్యాల లోని ఇందిరా భవన్ కు వెళ్లిన అధ్యక్షులు పెండం మహేందర్ , సంఘ సభ్యులు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా మహేందర్, సంఘ సభ్యులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ లోఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలవగా నూతన కార్యవర్గాన్ని అభినందించారు.
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ను మహేందర్ తో పాటు, సభ్యులు, సంఘం నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
ఈ కార్యక్రమంలోనాయి బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల నూతన కార్యవర్గం అధ్యక్షులు పెండ మహేందర్ , ఉపాధ్యక్షులు మర్రిపల్లి గంగ రాజం , ప్రధాన కార్యదర్శి రాచమల్ల శ్రీనివాస్ , సహాయ కార్యదర్శి మరిపెళ్లి సాగర్ , కోశాధికారి రాచర్ల శ్రీనివాస్ , ముఖ్య నాయకులు మానాల కిషన్ , గంగిపల్లి శంకర్ , బ్యాండ్ రాచమల్ల బాలరాజు , కొదురుపాక నారాయణ , రాచర్ల విజయ్ , పెండెం గంగారం , పెండెం గంగాధర్ ఫ్రెష్ దరి, పెండెం గంగాధర్ , గంగోత్రి గంగాధర్ , లారీ పెండెం గంగారం దేవి శ్రీ, కొమురవెళ్లి భూపతి, చిట్యాల కిష్టయ్య, ముడపెళ్లి అంజన్న, వెల్లుళ్ల నాగేష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *