బీంపూర్, సిరా న్యూస్
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండంలోని నిపాని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి ఆడే గజేందర్ సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఉప సర్పంచ్ ప్రణీత్ రెడ్డి తో పాటు 50 మంది నాయకులు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తోనే డెవలప్ మెంట్ సాధ్యమని గ్రహించి వారంతా పార్టీ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. కార్యక్రమంలో తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కల్యాణం లక్ష్మి రాజేశ్వర్, సర్పంచ్ ప్రపూల్ రెడ్డి, మండల కన్వీనర్ అశోక్, మాజీ జడ్పీటీసీ బాపన్న, హన్ను పటేల్, సుదర్శన్ రెడ్డి, రమేష్, అమర్ రెడ్డి, ఖాసిం, ముక్కెర ప్రభాకర్, వెంకటరెడ్డి, ఎంపీటీసీ కిష్టు, బోజ రెడ్డి, మానేరు నరేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.