సిరా న్యూస్, చిగురుమామిడి
బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
* పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
ఎంపీ బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బండి సంజయ్ వాక్యలపై కాంగ్రెస్ శ్రేణులతో కలిసి చిగురుమామిడి పోలీస్ స్టేషన్ లో సీఐ స్వామీకి ఫిర్యాదు చేశారు. మంగళవారం చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈసందర్బంగా జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ మాట్లాడుతూ బండి సంజయ్ కు అభివృద్ధి పట్ల ఆలోచన లేదని, గత 5 సంవత్సరాలలో ఏనాడు కనీసం ఒక్కసారి జడ్పీ సమావేశానికి హాజరు కాలేదన్నారు.పార్లమెంట్ ఎన్నికలస్తున్నాయని అధికార దాహంతో మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారన్నారు. గల్లీ నుండి ఢిల్లీకి పోయిన గాని తన స్థాయి మారలేదన్నారు. విధాన పరమైన, పరిపాలన పట్ల సరైన అవగాహన పెంచుకోవాలనీ హితవు పలికారు. పొన్నం ప్రభాకర్ విలువలతో కూడిన వ్వక్తిత్వమని, హిందూ ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత విమర్శలు చేస్తే తెలంగాణ సమాజం సహించబొదని, తెలంగాణ పల్లెలల్లో తిరగనీయబొమని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి చిటుమల్ల రవీందర్, డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, మండల ప్రధానకార్యదర్శి పూల లచ్చిరెడ్డి, చిగురుమామిడి రామంచ గ్రామ శాఖల అధ్యక్షులు వంగ కనకయ్య, వంటకాల సంపత్ రెడ్డి, నాయకులు కవ్వంపల్లి సంజీవ్, పోటు మల్లారెడ్డి, బెజ్జంకి అంజయ్య, పెసరి శ్రీనివాస్, చెల్పూరి విష్ణుమాచారి, పోలు శ్రీనివాస్, బోయిని వంశీకృష్ణ, పన్యాల జగన్ రెడ్డి, దొడ్ల రమణా రెడ్డి, కొత్తపల్లి సత్యనారాయణ, అనువోజు బాలకృష్ణ చారి, దోమ తిరుపతి రెడ్డి, గుజ్జుల రాజు తదితరులు పాల్గొన్నారు.