సిరాన్యూస్, బోథ్
కాంగ్రెస్ లో భారీ చేరికలు
* కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ ఎస్ నాయకులు
బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, సభ్యులు, కార్యకర్తలు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలో బోథ్ పట్టణానికి చెందిన, బోథ్ పట్టణ మాజీ వార్డ్ మెంబర్ షేక్ షాకీర్, అర్షద్, జునైద్, షాహిద్, తాహిర్, సోనాల మండల కో ఆప్షన్ మెంబెర్ మహమూద్,చెట్లపెల్లి సుధీర్,రమణారెడ్డి ,హరి సింగ్,శ్రీనివాస్ లు బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్, తెలంగాణ కాంగ్రెస్ విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ తుల అరుణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల తో పాటు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో సోనాల పట్టణ అధ్యక్షులు అనిల్ , యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ పోతరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్ కార్యదర్శి అనీష్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రమేష్ బత్తుల, గుడిహాత్నూర్ ఎంపీటీసీ అంకత్ రవి సీనియర్ నాయకులు గాజుల పోతన్న, గుడాల శేఖర్, విజయ్ భాస్కర్ రెడ్డి, పవన్ ప్రకాష్, లాల్ రామ్,కసిరె పోతన్న, అమృత్ రావ్, మహేష్,తదితరులు పాల్గొన్నారు