Congress BLA Meeting: బి ఎల్ ఏ సమావేశానికి తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

బి ఎల్ ఏ సమావేశానికి తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు…

హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బూత్ లెవ‌ల్ ఏజెంట్ల స‌మావేశానికి ఆదిలాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుండి బూత్ క‌మిటీ ఏజెంట్లు పెద్ద ఎత్తున బ‌య‌లుదేరి వెళ్లారు. గురువారం ఉదయం ఆదిలాబాద్ నుండి ప్రత్యేక బస్సులో హైదరాబాద్ కు బయలుదేరారు. ఏఐసీసీ అధ్య‌క్షులు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే ఈ సమావేశానికి హాజరుకానుడంతో ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి ఆధ్వ‌ర్యంలో బూత్ కమిటీ ఏజెంట్లు హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. కంది శ్రీ‌నివాస రెడ్డి నేతృత్వంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు పలువురు నాయకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *