బోనకల్లు లో కాంగ్రెస్ ప్రచారం

పాల్గోన్న మంత్రులు భట్టీ, పొంగులేటి
 సిరా న్యూస్,ఖమ్మం;
దేశ సంపద అంతా ప్రజలకే చెందాలని రాహుల్ గాంధీ గ్యారెంటీలు ప్రకటించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలోని బోనకల్లులో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షో ,కార్నర్ మీటింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.రోడ్ షో అనంతరం కార్నర్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతు..బిజెపి ప్రభుత్వం 10 సంవత్సరాలలో దేశ సంపదను పారిశ్రామికేతలకు పంచిపెట్టిందన్నారు.దేశ సంపద మొత్తం కూడా ప్రజలకే చెందాలని రాహుల్ గాంధీ గ్యారెంటీలు ప్రకటించారన్నారు.అబద్దాల పునాదులతో పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని హేద్దేవ చేశారు.కేసిఆర్ అబద్దాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారాన్నారు.బిఆర్ఎస్ పార్టీ పట్టుమని ఒక సీటు కూడా గెలిచేటట్లు లేదనీ
ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి సన్యాసులు, దద్దమ్మలని మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు.రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు ఉంటే.. ఇప్పటికే 65 లక్షలు మందికి రైతు బంధు డబ్బులు జమ చేశాం.ఈరోజు నుంచి మిగతా రైతులకు జమ చేస్తున్నామన్నారు.రాష్ట్రలో అన్ని శాఖలకు ఒకటో తారీకునే జీతాలు ఇస్తున్నామని,గోదావరి,కృష్ణ నది జలాలను పారించి ఖమ్మం జిల్లా రైతులు పాదాలు కడుగుతామన్నారు.అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లలో బీజేపీ చేసింది ఏమీ లేదని,కులాలు, మతాలు,ప్రాంతాలుగా రెచ్చగొడుతున్నారన్నారు. రాముడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు.అక్షంతలు మననేత్తిన చల్లి మూడోసారి ప్రధానమంత్రి కావాలని మోదీ కలలు కంటున్నారని అన్నారు.ఈ ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే రాజ్యాంగం మార్చేందుకు సిద్ధంగా ఉందనీ కెసిఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలే.. రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లఅప్పులపాలుచేసి మన నెత్తిన పెట్టాడని తెలిపారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలో రాకడం ఖాయమని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *