Congress Complaint to EC on KTR: కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రేస్‌

సిరా న్యూస్, హైదరాబాద్‌:

మంత్రి కేటీఆర్‌పై(KTR) కాంగ్రేస్‌ పార్టీ(Congress) ఈసీకి(EC) ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలు ఉండగా, తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ దీక్షా దివస్‌ నిర్వహించడంపై వారు మండిపడ్డారు. ఈ మేరకు దీక్షా దివస్‌ను ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు(Complaint) చేసారు. కోడ్‌ అమలు ఉండగా, దీక్షా దివస్‌ నిర్వహించడం, కోడ్‌ ఉల్లంఘనగా పరిగణించి కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలని కాంగ్రేస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. దీంతో స్పందించిన ఈసీ బృందం తెలంగాణ భవన్‌కు చేరుకొని, దీక్షా దివస్‌ను నిలిపివేయాలని కోరారు. అయితే ఇది కొత్త కార్యక్రమం కాదనీ, తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమని బీఆర్‌ఎస్‌ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యమ సమయంలో ’కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో‘ అనే నినాదంతో ప్రతీ తెలంగాణ వాదిలో ఉద్యమ జ్వాలలు రగిలించిన కేసీఆర్‌ దీక్షా చేపట్టారని, దీంతో ప్రతీ ఏడాది ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని బీఆర్‌ఎస్‌ నేతలు బదులిచ్చారు. అయితే కార్యక్రమాన్ని తెలంగాణ భవన్‌ లోపలే నిర్వహించుకోవాలని ఈసీ బృందం సభ్యులు వారికి సూచించారు. దీంతో భవన్‌ లోపలే దీక్షా దివస్‌ వేడుకలను బీఆర్‌ఎస్‌ నేతలు నిర్వహిస్తున్నారు. కాగా కాంగ్రేస్‌ నేతలు మాత్రం 144 సెక్షన్‌ అమలు ఉండగా ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని, వెంటనే ఈ కార్యక్రమాన్ని ఆపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ పరిణమాల దృష్ట్యా తెలంగాణ భవన్‌ వద్ద పోలీసులు బలగాలను భారీగా మోహరించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *