సిరాన్యూస్, నాంపల్లి
ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం : కాంగ్రెస్ గ్రామ నాయకులు ఎరుకల నాగయ్య
నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని దేవతపల్లిలో గల ఎస్సీ కాలనీలో నిర్మిస్తున్న ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి సోమవారం కాంగ్రెస్ గ్రామ నాయకులు ఎరుకల నాగయ్య, జక్కుల రాజులు రూ.లక్ష విరాళం అందజేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ నిధులు లేక ఆలయ నిర్మాణ పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తమ వంతంగా ఆర్థిక సాయం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ముదికొండ సైదయ్య, యేసు, వెంకటేష్, యదయ్య, బద్రి పాల్గొన్నారు.