సిరాన్యూస్, బేల
రుణమాఫీపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి : కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్
రైతు రుణమాఫీపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల చేస్తున్నట్లు చెప్పారు.దేశవ్యాప్తంగా అప్పట్లో 71 వేల కోట్ల రుణమాఫీ జరిగితే నేడు తెలంగాణ రాష్ట్రంలోనే 31 వేల కోట్లరూపాయల రైతు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ప్రతిపక్షాలు రైతులను కన్ఫ్యూజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.రేషన్ కార్డు అనేది కుటుంబాన్ని ఓ యూనిట్ గా తీసుకునేందుకు మాత్రమేనన్నారు. అప్పట్లో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధుని ఖాళీ స్థలాలకు, గుట్టలకు,వెంచర్లకు రైతుబంధు ఇచ్చి ప్రజాధనాన్ని వృధా చేసిందని మండిపడ్డారు.రైతు భరోసా పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతుందని, అసలైన రైతులను గుర్తించి రైతు భరోసా అందిస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పిటిసి రాందాస్ నాక్లే, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావార్, మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంఖడే, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గాన్షమ్, యూత్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ సామ రూపేష్ రెడ్డి, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు చంద్రకాంత్ అక్తర్ భాయి , సుధాం రెడ్డి, కరీం పురుషోత్తం, బొక్రె శంకర్,కన్యా రాజు మారుతి డదంజె బాపురావు అవినాష్, విలాస్ పాటిల్, అనిల్ ధోటే నానాజీ పాటిల్, మొబిన్ ఖురేషి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.