సిరాన్యూస్, బేల
రైతులను తప్పుదోవ పట్టిస్తున్న విపక్షాలు :కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్
బీఆర్ఎస్ నాయకులు రుణమాఫీ పేరుతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు.గత ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను తప్పుదోవ పట్టించదని విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటంలో నాటి ప్రభుత్వం విఫలమైందన్నారు. పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయకపోవటంతో అన్నదాతలు విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో మే 6 2022 నాడు కాంగ్రెస్ పార్టీ వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ చేసిందని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసేందుకు సిద్ధమైందని తెలిపారు.దాదాపుగా రాష్ట్రంలో రైతుల రుణమాఫీ 17వేల కోట్లు నేటి వరకు పూర్తయిందని పేర్కొన్నారు. సాంకేతిక సమస్యల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని రైతులు ఎవరు అదైర్యాపడదు అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బిజెపి ప్రభుత్వం గతంలో నల్లధనాన్ని తీసుకొచ్చి రైతుల అకౌంట్లోకి 15వేల రూపాయలను జమ చేస్తామని మోసపూరిత హామీ చేసిందని మండిపడ్డారు. ఆనాడు రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతుల ప్రాణాలు బలిగొన్న బిజెపి పార్టీ ఈరోజు రైతు రుణమాఫీ గురించి మాట్లాడం సిగ్గుచేటుగా ఉందని పేర్కొన్నారు.రైతులకు విజ్ఞప్తి బిజెపి, బిఆర్ఎస్ పార్టీల తప్పుడు మాటలను నమ్మి మోసపోకండి కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రాందాస్ నాక్లే, మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంఖడే, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావర్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ సామా రూపేష్ రెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఘన్ శ్యామ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మడవి చంద్రకాంత్, సుధాం రెడ్డి, బండి సుదర్శన్, రమేష్ పాటిల్ ఈశ్వర్ ధోటే కుంట రామ్ రెడ్డి అనీల్, ధోటే కరీం భాయ్, శంకర్ బొక్రె, విలాస్ పాటిల్,అవినాష్, సాగర్ థాక్రే పురుషోత్తం,రాజు కన్యవార్ బాపు రావు, గోడే ధైర్యావాన్ నానాజీ పాటిల్ ,నయన్ వాన్ఖడే కిషోర్ ఉర్వాతే, తదితర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.