సిరా న్యూస్,చిగురుమామిడి
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే డీఎస్సీ వాయిదా ఆందోళనలు
* కాంగ్రెస్ మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్
డీఎస్సీ పరీక్ష వాయిదా ముసుగులో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే కృత్రిమ ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ సృష్టించిందని మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ విమర్శించారు.గురువారం చిగురుమామిడి మండల కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.వారు మాట్లాడుతూ డీఎస్సీ వాయిదా ఆందోళనల వెనుక కొన్ని కోచింగ్ సెంటర్ల మాఫియా హస్తముందన్నారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నోటిఫికేషన్లు వెయ్యక నిరుద్యోగ జీవితాలను చిన్నాభిన్నం చేసిందన్నారు.ప్రభుత్వం ఏర్పడగానే పరీక్షలకు నోటిఫికేషన్లతో పాటు 30 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.తమ ఉనికిని కాపాడుకోవడానికి నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తుందన్నారు.డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.