ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు

సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గోన్నారు. రఘునందన్ రావు మాట్లాడుతూ వందల కోట్లు దోచుకుని లిక్కర్ మాఫియా కవిత జైలుపాలైంది. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన రూ. 2వేల పెన్షన్ ను రూ. 4 వేలు చేస్తామని చెప్పి 5 నెలల గడుస్తున్న పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. లంక బిందెలు దొరుకుతాయనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పడం ఎంతవరకు సమంజసం. ముఖ్యమంత్రి కనిపించే దేవుళ్ల పైన ఒట్లు వేయడం అతని నైజం. ఒక పరిశ్రమ వద్ద కవిత వందల కోట్లు కాజేసి ఢిల్లీ లో లిక్కర్ దుకాణం పెట్టి దానికి ప్రతిఫలమే ఈరోజు తీహార్ జైల్లో కవిత. వెంకట్రాంరెడ్డి గతంలో ఒక జిల్లా కలెక్టర్ గా ఉండి ఎక్కడ దొరికితే అక్కడ అసైన్డ్ మెంట్ భూములు లాక్కొని కోట్ల రూపాయలకు మింగేశాడని అన్నారు.
రాజాసింగ్ మాట్లాడుతూ దుబ్బాక ప్రజలు రఘునందన్ రావు ను అసెంబ్లీకి పంపిస్తే అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించాడు. 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి జరిగిందంటే నరేంద్ర మోడీ పుణ్యమే . ఈరోజు బిజెపి ప్రభుత్వ ధ్యేయం 400 ఎంపీ సీట్లు అన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. దేశంలో తీవ్రవాదులను లేకుండా చేయడమే బిజెపి లక్ష్యం. మూడు నెలలో మూడు పార్టీలు మారిన వ్యక్తికి ఈరోజు ఎంపీ టికెట్ ఇవ్వడం
సిగ్గుచేటు. బిసీ నాయకుడు అని చెప్పి ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సమంజసం. బీసీ నినాదమే ముందుకు వస్తే ఎంతమంది బీసీలకు టికెట్ ఇచ్చావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సామాజిక వర్గానికి చెందిన నీ బంధువులకు ఎంతమందికి టికెట్లు ఇచ్చావో మాకు తెలుసనిఅన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *